ముఖ్యమంత్రి జగన్కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ లేఖ రాశారు. ఏపీకి ప్రత్యేక హాదా, విభజన హామీలపై కేంద్రాన్ని నిలదీయాలని నిర్ణయించటం అభినందనీయమన్నారు. 2014-15 లోటు బడ్జెట్ నిధులు కేంద్రం ఇప్పటికీ ఇవ్వలేదని పేర్కొన్నారు. వెనుకబడిన ప్రాంతాలకు ఇవ్వాల్సిన నిధుల్లో కేంద్రం కోత విధించిందని తెలిపారు. విభజన హామీల్లో ఏ ఒక్కటీ పూర్తిగా అమలు చేయలేదని గుర్తుచేశారు. రాష్ట్ర హక్కుల కోసం ఎంపీలు పోరాటం చేయాలని లేఖలో అభిప్రాయపడ్డారు.
జగన్కు సీపీఐ రామకృష్ణ లేఖ... ఆ నిర్ణయంపై అభినందనలు - సీఎం కు సీపీఐ రామకృష్ణ లేఖ వార్తలు
విభజన హామీల అమలుపై పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రాన్ని నిలదీయాలని... వైకాపా ఎంపీలు నిర్ణయించటం అభినందననీయని సీపీఐ రామకృష్ణ పేర్కొన్నారు.
![జగన్కు సీపీఐ రామకృష్ణ లేఖ... ఆ నిర్ణయంపై అభినందనలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5096608-161-5096608-1574014128700.jpg)
CPI ramakrishna letter to CM jagan over parlament sessions