ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీపీఐ నేత రాజాకి అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక - cpi leader d.raja latest update

సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా అస్వస్థతకు గురయ్యారు. పార్టీ నేతలు వెంటనే ఆయనను కామినేని ఆస్పత్రికి తరలించారు.

సీపీఐ రాజా
సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజాకి అస్వస్థత

By

Published : Jan 31, 2021, 2:29 AM IST

సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్​ హిమాయత్‌నగర్‌లోని మగ్దూమ్‌ భవన్‌లో జరుగుతున్న సీపీఐ జాతీయ సమితి సమావేశాలకు ఆయన హాజరయ్యారు. ఈ క్రమంలో అస్వస్థతకు గురైన రాజాను.. చికిత్స నిమిత్తం కామినేని ఆస్పత్రికి తరలించారు.

బీపీ తగ్గిపోవడం వల్లే డి.రాజా అస్వస్థతకు గురైనట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని సీపీఐ నేతలు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details