ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'3 రాజధానులే కావాలంటే.. అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లండి'

వైకాపా ప్రభుత్వం 3 రాజధానులను ఏర్పాటు చేయలంటే.... అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ గెలవాలని.... సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. అమరావతి ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు. హైదరాబాద్ లో నిర్వహించిన సమావేశానికి హాజరయ్యారు.

By

Published : Aug 23, 2020, 2:16 PM IST

CPI Narayana solidarity with the Amravati movement
సీపీఐ నారాయణ

సీపీఐ నారాయణ

అమరావతి ఉద్యమానికి సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంఘీభావం తెలిపారు. హైదరాబాద్ లో నిర్వహించిన.... అమరావతి దీక్షా శిబిరంలో పాల్గొన్నారు. భూములు ఇచ్చిన రైతులను స్వార్థపరులు అనడం సరికాదన్నారు. అమరావతిలో ఖర్చు చేసిన రూ.వేల కోట్ల ప్రజాధనం వైకాపా ప్రభుత్వం వృథా చేస్తోందని నారాయణ విమర్శించారు. గాంధీ జయంతి రోజు దిల్లీ వెళ్లి రైతులకు సంఘీభావం తెలుపుతామని చెప్పారు.

వైకాపా ప్రభుత్వం 3 రాజధానులను ఏర్పాటు చేయలనుకుంటే... అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ గెలవాలని... నారాయణ డిమాండ్ చేశారు. మేనిఫెస్టోలో ప్రస్తావించని విషయాన్ని.. రాజకీయ లబ్ధికోసం అనూహ్యంగా తెరపైకి తీసుకొచ్చారని మండిపడ్డారు. ఈ విషయంలో కేంద్రం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details