ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హుందాగా వ్యవహరించకపోతే రాజకీయ సంక్షోభం తప్పదు: నారాయణ - ఎస్​ఈసీని శత్రువుగా భావిస్తూ ప్రభుత్వం ప్రతిష్టకు పోతోందన్న సీపీఐ నారాయణ

ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్​ను శత్రువుగా భావిస్తూ.. ప్రభుత్వం ప్రతిష్టకు పోతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. వైఎస్​ రాజశేఖర్ రెడ్డి లాంటి వారే ఎన్నికల కమిషన్​తో వివాదాలకు పోకుండా జాగ్రత్తపడ్డారని గుర్తు చేశారు. ప్రభుత్వం హుందాగా ప్రవర్తించాలని హితవు పలికారు.

cpi narayana about ap local body elections
ఏపీ స్థానిక ఎన్నికలపై సీపీఐ నారాయణ వ్యాఖ్యలు

By

Published : Jan 23, 2021, 3:52 PM IST

ఏపీ స్థానిక ఎన్నికలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యలు

ఏపీ రాజకీయ పరిణమాలు చాలా ప్రమాదకరంగా మారిపోయాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అభిప్రాయపడ్డారు. రెండు ప్రభుత్వ యంత్రాంగాల మధ్య ప్రత్యక్ష యుద్ధం జరుగుతోందని వ్యాఖ్యానించారు. ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్​ను శత్రువుగా భావిస్తూ.. సీఎం జగన్ ప్రతిష్టకు పోతున్నారని విమర్శించారు.

వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి లాంటి వారే ఎన్నికల కమిషన్‌తో వివాదాలు పెట్టుకోకుండా జాగత్రపడ్డారని నారాయణ గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం హుందాతనంతో వ్యవహరించాలని.. లేనిపక్షంలో రాజకీయ సంక్షోభం తప్పదని హెచ్చరించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details