రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె.నారాయణ స్వాగతించారు. నిమ్మగడ్డ రమేశ్కుమార్ తొలగింపునకు రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించిందన్నారు.
'శిశుపాలుడిలా తప్పులు చేస్తూనే ఉన్నారు' - నిమ్మగడ్డ పిటిషన్పై హైకోర్టు తీర్పు
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్కుమార్ తొలగింపుపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని సీపీఐ నేత నారాయణ అన్నారు. నిమ్మగడ్డ వ్యవహారంలో ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించిందని ఆయన ఆరోపించారు.
!['శిశుపాలుడిలా తప్పులు చేస్తూనే ఉన్నారు' సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె.నారాయణ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7394710-146-7394710-1590748345609.jpg)
సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె.నారాయణ
న్యాయస్థానం తీర్పుతో ప్రభుత్వం చేసిన తప్పిదం మరోసారి బయటపడిందని నారాయణ అన్నారు. శిశుపాలుడిలా ముఖ్యమంత్రి తప్పులు చేస్తూ వెళ్తున్నారని ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి :'ఎస్ఈసీ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తాం'