సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ సీఎం జగన్కు లేఖ రాశారు. పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని లేఖలో పేర్కొన్నారు. కరోనా విజృంభిస్తున్న వేళ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం తగదన్నారు. ఈ సంక్షోభ సమయంలో ప్రైవేట్ టీచర్లను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. వారికి నెలకు రూ.5 వేలు నగదు, నిత్యావసర వస్తువులు అందించాలని విజ్ఞప్తి చేశారు.
పది, ఇంటర్ పరీక్షలపై సీఎం జగన్కి సీపీఐ నేత రామకృష్ణ లేఖ - letter to cm jagan latest news
పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని కోరుతూ.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సీపీఐ నేత కె. రామకృష్ణ లేఖ రాశారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రైవేటు టీచర్లను ఆదుకోవాలని కోరారు.

సీపీఐ నేత రామకృష్ణ