AMARAVATI FARMERS PADAYATRA: శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న రాజధాని రైతులు.. రెట్టించిన ఉత్సాహంతో పాదయాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు. 41వ రోజు పాదయాత్ర శ్రీకాళహస్తి నుంచి ప్రారంభించనున్నారు. రాయలసీమ ప్రజల నుంచి లభిస్తున్న అపూర్వ మద్దతుతో దాదాపు 17 కిలోమీటర్ల నడక సాగించనున్నారు. శ్రీకాళహస్తి నుంచి మిట్టకండ్రిగ, చెర్లోపల్లే, ఇసుకగుంట, రాచగన్నెరు మేర్లపాక, ఏర్పేడు, సీతారాంపేట మీదుగా అంజిమేడు వరకు యాత్ర కొనసాగనుంది.
అమరావతి రైతులకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంఘీభావం తెలిపారు. 3రాజధానులతో రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం ఉండదన్నారు.
ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రమైన తమిళనాడు రాజధాని చెన్నై. హైకోర్టు చెన్నైలోనే ఉంది. హైకోర్టు బెంచ్ మాత్రం మధురైలో ఉంది. కేరళ రాజధాని తిరువనంతపురం. హైకోర్టు కొచ్చిన్లో ఉంది. అక్కడ అంతా సవ్యంగా నడుస్తున్నాయి. సీఎం జగన్ మూడు రాజధానుల అంశాన్ని ఎందుకు తీసుకువచ్చారు..? రాష్ట్రానికి ఒకే ఒక్క రాజధాని ఉండాలి. అది అమరావతే. - డి. రాజా, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి
సభకు అనుమతి నిరాకరణ..