'కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ చేసింది. ఒక్క రోజు జనతా కర్ఫ్యూ పాటించిన ప్రజలు ఈరోజు రోడ్లపైకి వస్తున్నారు . దీంతో వారిని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నాం . నగరంలో ఎక్కడికక్కడ చెక్ పోస్ట్లు ఏర్పాటు చేసి రోడ్డుపైకి వచ్చిన వారిని తిప్పి పంపుతున్నాం. అవసరంలేని దుకాణాలను మూసివేయిస్తున్నాం' అని విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. పోలీసులు తీసుకుంటున్న చర్యలపై ఆయన మాట్లాడారు.
అత్యవసరమైతేనే బయటికి రండి: సీపీ తిరుమలరావు
రాష్ట్రంలో లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు రోడ్లపైకి రాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. పోలీసులు తీసుకుంటున్న చర్యలపై విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు ఈటీవీ భారత్తో మాట్లాడారు. రద్దీ నియంత్రణ చర్యలను వివరించారు.
cp dwaraka tirumalarao on corona precautions