ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో... ఇకపై కొవిషీల్డే!

రాష్ట్రంలో మొదటి డోస్‌ కింద ఇకపై కొవిషీల్డే ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కేంద్రం నుంచి వచ్చే సరఫరాను అనుసరించి వైద్య, ఆరోగ్య శాఖ ఈ మేరకు చర్యలు చేపట్టిందని తెలిపారు.

By

Published : Apr 20, 2021, 7:40 AM IST

covishield
covishield

రాష్ట్రంలో ఆరోగ్య సిబ్బందికి సోమవారం కొవిడ్‌ టీకాలను వేశారు. ఇప్పటి వరకు టీకాలు వేయించుకోనివారికి, రెండో డోసు వేయించుకోవాల్సిన వారికి పంపిణీ చేశారు. మంగళవారం ఇతర శాఖల ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు టీకాలు వేయనున్నారు. బుధవారం నుంచి అర్హులైన ఇతరులకు ఇవ్వనున్నారు.

ఇకపై కొవిషీల్డ్‌ టీకా మాత్రమే ఇస్తారు. కొవాగ్జిన్‌ ఇచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఇప్పటికే మొదటి డోస్‌ కొవాగ్జిన్‌ తీసుకున్నవారికి మాత్రమే రెండో డోసు కింద కూడా అదే టీకాను ఇవ్వనున్నారు. కేంద్రం నుంచి వచ్చే సరఫరాను అనుసరించి వైద్య, ఆరోగ్య శాఖ ఈ మేరకు చర్యలు తీసుకుంటోంది.

ABOUT THE AUTHOR

...view details