ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 9, 2020, 6:26 PM IST

ETV Bharat / city

'కేంద్రంతో సంబంధం లేకుండా తెలంగాణలో కొవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేలా చూడాలి'

భారత్ బయోటెక్ వ్యాక్సిన్​పై ఎంఐఎం తెలంగాణ రాష్ట్ర శాసనసభపక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ ప్రసంశలు కురిపించారు. కరోనా వాక్సిన్ కోసం భారత్ బయోటెక్ చేస్తోన్న కృషిని ఆయన ఆ రాష్ట్ర అసెంబ్లీలో కొనియాడారు. తెలంగాణ ఖ్యాతిని ఇనుమడింపజేసిందని పేర్కొన్నారు.

Covid vaccine should be given in Telangana irrespective of center
కేంద్రంతో సంబంధం లేకుండా తెలంగాణలో కొవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేలా చూడాలి

కొవిడ్‌ వ్యాక్సిన్‌ తెస్తున్న భారత్‌ బయోటెక్‌ కృషి అభినందనీయని ఎంఐఎం తెలంగాణ రాష్ట్ర శాసనసభపక్షనేత అక్బరుద్దీన్‌ ఒవైసీ అన్నారు. తెలంగాణ ఖ్యాతిని భారత్‌ బయోటెక్‌ ఇనుమడింపజేసిందని కరోనాపై ఆ రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన సమావేశాల్లో కొనియాడారు.

ఇప్పుడు వ్యాక్సిన్‌ రెండో దశ ప్రయోగంలో ఉందని పేర్కొన్నారు. భారత్‌ బయోటెక్‌తో సీఎం కేసీఆర్ సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. కేంద్రంతో సంబంధం లేకుండా తెలంగాణలో వ్యాక్సిన్‌ ఇచ్చేలా చూడాలని కోరారు.

భారత్‌ బయోటెక్‌ సంస్థతో మాట్లాడుతున్నామని టీసీఎం కేసీఆర్‌ తెలిపారు. సొంత రాష్ట్రం కనుక వ్యాక్సిన్‌ పంపిణీలో ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు.

ఇవీ చదవండి: పర్యావరణ అనుమతులు తీసుకోకుండా ప్రాజెక్టులపై ముందుకెళ్లొద్దు: ఎన్జీటీ

ABOUT THE AUTHOR

...view details