ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 1,271 కరోనా కేసులు.. ముగ్గురు మృతి

రాష్ట్రంలో తాజాగా 1,271 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో ముగ్గురు మృతి చెందారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 285 కేసులు నమోదవ్వగా... అతితక్కువగా పశ్చిమ గోదావరి జిల్లాలో 12 కేసులు నమోదయ్యాయి.

By

Published : Apr 1, 2021, 6:52 PM IST

Updated : Apr 1, 2021, 9:45 PM IST

corona cases today in andhrapradesh
corona cases today in andhrapradesh

గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,271 మందికి కరోనా సోకినట్లుగా వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6 వేల 142 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యాధికారులు తెలిపారు. 24 గంటల వ్యవధిలో 464 మంది కరోనా నుంచి కోలుకున్నారు. వైరస్ కారణంగా మరో ముగ్గురు మృతి చెందారు. తాజా కేసులతో కలిపి.. రాష్ట్రంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య.. 9, 03, 260కి చేరింది.

నేడు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల వివరాలు

జిల్లాల వారిగా తాజా కేసుల సంఖ్య...

చిత్తూరులో 285, గుంటూరులో 279, విశాఖలో 189, కృష్ణాలో 161, ప్రకాశంలో 63, కడప జిల్లాలో 63, అనంతపురంలో 61, కర్నూలులో 52, నెల్లూరులో 43, తూర్పు గోదావరి జిల్లాలో 27, శ్రీకాకుళం జిల్లాలో 21, విజయనగరంలో 15, ప.గో. జిల్లాలో 12 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఇదీ చదవండి:

'మా ఉద్దేశం ఫైన్‌ వేయటం కాదు.. మాస్కులు ధరించేలా చేయటం'

Last Updated : Apr 1, 2021, 9:45 PM IST

ABOUT THE AUTHOR

...view details