ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

యాదాద్రి ఆలయంలో 30 మందికి కరోనా పాజిటివ్ - యాదాద్రి ఆలయంలో ఉద్యోగులు 30 మందికి సోకిన కరోనా

రేపటి నుంచి మూడు రోజుల పాటు తెలంగాణలోని యాదాద్రి ఆలయంలో ఆర్జిత సేవలు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దేవస్థానం ఉద్యోగులు 30 మందికి కరోనా నిర్ధరణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

corona effected in yadadri temple, 30 members affected with corona at yadadri temple
యాదాద్రి ఆలయంలో కరోనా కలవరం, 30 మంది యాదాద్రి ఆలయ ఉద్యోగులకు సోకిన కరోనా

By

Published : Mar 27, 2021, 9:04 PM IST

తెలంగాణలో కరోనా పంజా విసురుతోంది. తాజాగా యాదాద్రి ఆలయంలోని 30 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్​ వచ్చింది. సిబ్బందికి కొవిడ్​ పాజిటివ్​ నిర్ధరణ కావడం వల్ల ఆలయంలో స్వామివారి పూజలకు ఆంటంకం కలగనుంది. రేపు ఆదివారం కావడంతో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున.. ఆర్జిత సేవలను రేపటి నుంచి మూడు రోజుల పాటు నిలిపేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

ఆలయ ఉద్యోగులతో పాటు యాదగిరిగుట్ట మండలం మల్లాపురంలో 16 మందికి కొవిడ్​ సోకగా.. మండలంలో మొత్తం 48 మంది కరోనా​ బారిన పడ్డారు. రాష్ట్రంలో లాక్​డౌన్​ అమలుచేయమని స్పష్టం చేసిన ప్రభుత్వం.. కొవిడ్​ నుంచి తప్పించుకోవాలంటే మాస్కులు ధరించడం, భౌతికదూరం కచ్చితంగా పాటించాలని సూచించింది.

ABOUT THE AUTHOR

...view details