ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 9, 2020, 2:52 PM IST

ETV Bharat / city

తెలంగాణలో కొత్తగా 721 కరోనా కేసులు

తెలంగాణలో మరో 721 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. మొత్తం కేసుల సంఖ్య 2,75,261మందికి చేరింది. వైరస్ బారిన పడి మరో ముగ్గురు మృతి చెందారు.

తెలంగాణలో కొత్తగా 721 కరోనా కేసులు
తెలంగాణలో కొత్తగా 721 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 721 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 2,75,261మందికి చేరింది. మహమ్మారి కాటుతో మరో ముగ్గురు మృతి చెందగా... మరణించిన వారి సంఖ్య 1,480 మందికి చేరింది. తాజాగా మరో 753 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనా నుంచి 2,66,120 మంది కోలుకున్నారు.

ప్రస్తుతం 7,661 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం 5,576 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు పేర్కొంది.

ఇదీ చదవండి:ఏలూరులో 583కు చేరిన వింత వ్యాధి బాధితుల సంఖ్య

ABOUT THE AUTHOR

...view details