ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 8, 2021, 7:26 PM IST

ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 62 మందికి కరోనా... ఒకరు మృతి!

రాష్ట్రంలో కొత్తగా 62 మందికి కరోనా సోకినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. 102 మంది వైరస్ నుంచి కోలుకోగా.. ఒకరు మృతి చెందినట్లు వెల్లడించింది. తాజా గణాంకాలతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కొవిడ్ కేసుల సంఖ్య 8,88,485కి చేరిందని పేర్కొంది.

corona latest updates in andhrapradesh
రాష్ట్రంలో కొత్తగా 62 మందికి కరోనా... ఒకరు మృతి...

గడచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్​లో 22,094 నమూనాలను పరీక్షించగా.. 62 మందికి కొవిడ్ నిర్ధరణ అయింది. 102 మందికి కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. వైరస్ ధాటికి రాష్ట్రంలో ఒకరు మరణించారు.

రాష్ట్రంలో కొత్తగా 62 మందికి కరోనా... ఒకరు మృతి...

ఇప్పటి వరకు రాష్ట్రంలో కోటీ 33 లక్షల 67 వేల 616 కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్టు వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. 8,88,485 మందికి కరోనా సోకినట్లు పేర్కొంది. వారిలో 8.8 లక్షల మందికిపైగా కోలుకున్నారని తెలిపింది. ఇప్పటి వరకు మెుత్తం 7,160 మంది వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయారని ప్రకటించింది.

ABOUT THE AUTHOR

...view details