ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో 226కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు - breaking

corona-latest-update-ap
రాష్ట్రంలో 226కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

By

Published : Apr 5, 2020, 11:14 AM IST

Updated : Apr 5, 2020, 12:09 PM IST

11:12 April 05

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 226కు చేరింది. శనివారం రాత్రి 9 నుంచి ఆదివారం ఉదయం 9 వరకు కొత్తగా 34 కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో 23, చిత్తూరు జిల్లాలో 7 కొత్త కేసులు నమోదవగా... ప్రకాశం జిల్లాలో 2, నెల్లూరు జిల్లాలో 2 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు... కరోనాపై వైద్య ఆరోగ్యశాఖ తాజాగా బులెటిన్‌ విడుదల చేసింది.

రాష్ట్రంలో 226కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 226కు చేరింది. నెల్లూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు 34కు చేరాయి. గుంటూరు జిల్లాలో 30, కృష్ణా జిల్లాలో 28, కర్నూలు జిల్లాలో 27, ప్రకాశం జిల్లాలో 23, కడప జిల్లాలో 23, చిత్తూరు జిల్లాలో 17, విశాఖ జిల్లాలో 15, పశ్చిమ గోదావరి జిల్లాలో 15, తూర్పు గోదావరి జిల్లాలో 11, అనంతపురం జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు 3కు చేరాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కరోనా కేసులు నమోదు కాలేదు.

Last Updated : Apr 5, 2020, 12:09 PM IST

For All Latest Updates

TAGGED:

breaking

ABOUT THE AUTHOR

...view details