ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 125 కరోనా కేసులు నమోదు - corona cases in ap news

రాష్ట్రంలో కొత్తగా 125 మందికి కరోనా సోకింది. 24 గంటల వ్యవధిలో ఒక్క మరణం కూడా నమోదు కాలేదని.. వైద్యారోగ్య శాఖ బులెటిన్​లో పేర్కొంది.

corona-cases-update-in-andhra-pradesh
రాష్ట్రంలో కొత్తగా 125 కరోనా కేసులు నమోదు

By

Published : Jan 29, 2021, 7:56 PM IST

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 42,809 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 125 కొత్త కేసులు నమోదయ్యాయి. వీరితో కలిపి మొత్తం కరోనా బాధితుల సంఖ్య 8 లక్షల 87 వేల 591కు చేరింది. గడిచిన 24 గంటల్లో ఒక్క మరణం కూడా నమోదు కాలేదని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు.

రాష్ట్రంలో కొత్తగా 125 కరోనా కేసులు నమోదు

శుక్రవారం(29.01.21) వరకు మొత్తం మరణాల సంఖ్య 7,152గా ఉంది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. తాజాగా 175 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. వీరితో కలిపి రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 8 లక్షల 79 వేల 131కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,308 యాక్టివ్‌ కేసులున్నాయి.

ఇదీ చదవండి:

వైకాపా నేతలు నామినేషన్లు వేయనివ్వటం లేదని ఎస్​ఈసీకి ఫిర్యాదు

ABOUT THE AUTHOR

...view details