ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కొత్తగా 685 కరోనా కేసులు.. మరో నలుగురు మృతి

రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతోంది. కొత్తగా 685 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి.. రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 8,68,749కి చేరింది.

By

Published : Dec 1, 2020, 5:40 PM IST

Corona cases today in AP
Corona cases today in AP

రాష్ట్రంలో కొత్తగా 685 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి కరోనా బాధితుల సంఖ్య 8,68,749కి చేరింది. తాజాగా మరో నలుగురు ప్రాణాలు వదిలారు. వీరితో కలిపి ఇప్పటివరకు కరోనాతో 6,996 మంది మృతి చెందారు. కరోనా నుంచి మరో 1,094 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 8.54 లక్షల మంది కొవిడ్​ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 7,427 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 24 గంటల వ్యవధిలో 51,854 కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు 1,01,09,708 మందికి కరోనా పరీక్షలు చేశారు.

జిల్లాల వారీగా...

అనంతపురం, చిత్తూరు, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు. గడచిన 24 గంటల్లో కృష్ణా జిల్లాలో అత్యధికంగా 146 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. చిత్తూరులో 95, గుంటూరులో 87, పశ్చిమ గోదావరి జిల్లాలో 77, విశాఖలో 71, తూర్పు గోదావరి జిల్లాలో 70, నెల్లూరులో 39, కడపలో 30, ప్రకాశంలో 30, అనంతపురంలో 18, కర్నూలులో 10, విజయనగరంలో 9, శ్రీకాకుళంలో 3 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఇదీ చదవండి:

సీఎం జగన్​పై 3 పిటిషన్లు: రెండింటిని కొట్టేసిన సుప్రీం

ABOUT THE AUTHOR

...view details