ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తెలంగాణ: భైంసా గురుకుల పాఠశాలలో మరో 25 మందికి కరోనా

తెలంగాణలో కొవిడ్ కలకలం రేపుతోంది. తాజాగా నిర్మల్‌ జిల్లాలోని భైంసా బాలుర గురుకుల పాఠశాలలో 25 మందికి కరోనా సోకింది.

By

Published : Mar 18, 2021, 5:09 PM IST

Published : Mar 18, 2021, 5:09 PM IST

Corona cases
భైంసా గురుకుల పాఠశాలలో మరో 25 మంది విద్యార్థులకు కరోనా

తెలంగాణ నిర్మల్‌ జిల్లాలోని భైంసా బాలుర గురుకుల పాఠశాలలో కరోనా కలకలం కొనసాగుతోంది. కొత్తగా మరో 25 మందికి కొవిడ్​ నిర్ధరణ అయింది. పాఠశాలలో మొత్తం 180 మంది విద్యార్థులుండగా... రెండు రోజుల్లో 90 మందికి పరీక్షల నిర్వహించారు.

కొత్తగా నమోదైన కేసులతో కలిపి మొత్తం 35 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. పాఠశాల యాజమాన్యం మిగతా విద్యార్థులకు కూడా పరీక్షలు నిర్వహించనుంది. బాధిత విద్యార్థులను హోంఐసోలేషన్​లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

మరోవైపు అదిలాబాద్ జిల్లా ఉట్నూరు సెంట్‌పాల్ స్కూల్‌లో ముగ్గురు విద్యార్థులకు కరోనా నిర్ధరణ అయింది. గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఓ ఒప్పంద ఉపాధ్యాయునికి కరోనా సోకింది.

ఇదీ చూడండి:

ఎంపీ రఘురామకృష్ణరాజుకి హైకోర్టులో ఊరట

ABOUT THE AUTHOR

...view details