ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో కరోనా కల్లోలం... కొత్తగా 21,954 కేసులు, 72 మరణాలు - ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు

corona cases in ap
corona cases in ap

By

Published : May 6, 2021, 6:31 PM IST

Updated : May 6, 2021, 7:14 PM IST

18:28 May 06

ఏపీలో కరోనా కేసులు

కరోనా కేసులు

రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కొవిడ్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,10,147 పరీక్షలు నిర్వహించారు. కొత్తగా 21,954 కేసులు నిర్ధరణ కాగా.. 72 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,82,329 కరోనా క్రియాశీల కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.

జిల్లాల వారీగా కేసులు

గడచిన 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 2,354 కరోనా కేసులు నమోదయ్యాయి. తూర్పు గోదావరి 3,531 , విశాఖ 2,107 చొప్పున కేసులు నమోదయ్యాయి.

జిల్లాల వారీగా మరణాలు

గత 24 గంటల వ్యవధిలో విశాఖలో అత్యధికంగా 11 మంది మృత్యవాత పడగా.. తూ.గో, విజయనగరం జిల్లాల్లో 9 మంది మృత్యువాత పడ్డారు. అనంతపురం జిల్లాలో 8మంది, ప్రకాశం జిల్లాలో ఆరుగురు మహమ్మారికి బలయ్యారు. చిత్తూరు, ప.గో, గుంటూరు జిల్లాల్లో ఐదుగురు చొప్పున మరణించారు. కృష్ణా, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో నలుగురు చొప్పున మృతి చెందగా.. నెల్లూరు జిల్లాలో ఇద్దరు చనిపోయారు.

ఇదీ చదవండి:

విషాదం: అర్ధాంగి ఒడిలో అర్థాంతరంగా ఆగిన గుండె

Last Updated : May 6, 2021, 7:14 PM IST

ABOUT THE AUTHOR

...view details