ఏపీలో కొత్తగా 2,901 కరోనా కేసులు.. 19 మంది మృతి - ఏపీలో కరోనా కేసుల సంఖ్య

17:41 October 27
ఆంధ్రప్రదేశ్లో 2901 కరోనా కేసులు నమోదు
ఏపీలో తాజాగా 2901 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 19 మంది కరోనాతో మృతి చెందారు. ఇప్పటివరకు 8,11,825 మంది కరోనా బారిన పడ్డారు. కొవిడ్తో మొత్తం 6,625 మంది మృతి చెందారు. ఇప్పటివరకు కరోనా నుంచి 7,77,900 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 27,300 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 74,757 కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు 76.96 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
ఇదీ చదవండి:దేశవ్యాప్త ఆందోళనకు రైతు సంఘాల పిలుపు