హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయలేదని కోర్టు ధిక్కరణ వ్యాజ్యాలు...విచారణ వాయిదా - ఎయిడెడ్ పాఠశాలలపై హైకోర్టు ఉత్తర్వులు
![హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయలేదని కోర్టు ధిక్కరణ వ్యాజ్యాలు...విచారణ వాయిదా high court on aided schools](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13218177-687-13218177-1632996745626.jpg)
14:21 September 30
HC on Schools : హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేయలేదని కోర్టు ధిక్కరణ వ్యాజ్యాలు
ఎయిడెడ్ పాఠశాలల్లో ఖాళీ పోస్టుల భర్తీ పై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేయలేదన్న.. కోర్టు ధిక్కరణ వ్యాజ్యాలపై విచారణ ముగిసింది. గత ఉత్తర్వులను వక్రీకరిస్తూ జీవో 37 విడుదల చేశారని పిటిషనర్ తరపు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. ఇ-రేషనలైజేషన్ ప్రక్రియను అధికారులు ప్రారంభించారని పిటిషనర్ న్యాయవాది వివరించారు. ఈ విచారణకు ముఖ్య కార్యదర్శి రాజశేఖర్, విద్యాశాఖ డైరెక్టర్ చినవీరభద్రుడు కోర్టు ముందుకు హాజరయ్యారు. వాదోపవాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను అక్టోబర్ 22కు వాయిదా వేసింది. తదుపరి విచారణకు కూడా అధికారులు కోర్టుకు రావాలని ఆదేశించింది.
ఇదీ చదవండి : అమరావతి భూముల ఆంశంపై హైకోర్టులో విచారణ వాయిదా