ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 29, 2022, 3:43 PM IST

ETV Bharat / city

ఆస్ట్రేలియా-ఇండియా క్రికెట్​ మ్యాచ్.. అజారుద్దీన్​​, హెచ్​సీఏపై మరో ఫిర్యాదు

Complaint against HCA and Azharuddin: ఆస్ట్రేలియా-ఇండియా క్రికెట్​ మ్యాచ్​కు సంబంధించి టికెట్ల వ్యవహారంలో భారీ కుంభకోణం జరిగిందంటూ వీహెచ్​పీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ రావినూతల శశిధర్ హైదరాబాద్​ సెంట్రల్​ క్రైమ్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. హెచ్​సీఏతో పాటు అధ్యక్షుడు అజారుద్దీన్​​​పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Complaint against HCA and Azharuddin
అజారుద్దీన్​​పై ఫిర్యాదు

Complaint against HCA and Azharuddin: హైదరాబాద్​ క్రికెట్​ ఆసోసియేషన్​పై వరుస ఫిర్యాదులు నమోదవుతున్నాయి. తాజాగా ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరిగిన టీ20 మ్యాచ్​లో టికెట్ల విషయంలో కోట్ల కుంభకోణం జరిగిందటూ.. దీనిపై త్వరితగతిన విచారణ జరపాలని వీహెచ్​పీ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ రావినూతల శశిధర్ హైదరాబాద్​ సెంట్రల్​ క్రైమ్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

మ్యాచ్ సందర్భంగా ఆన్​లైన్, కాంప్లిమెంటరీ టికెట్ల పేరుతో హెచ్‌సీఏతో పాటు అధ్యక్షుడు అజారుద్దీన్​​ పాల్పడ్డ అక్రమాలపై కేసు నమోదు చేయాలని ఆయన పేర్కొన్నారు. టికెట్ల కుంభకోణం వెనక ఉన్న నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా జింఖానా మైదానంలో తొక్కిసలాట, టికెట్ల వ్యవహారంలో ఇప్పటికే బేగంపేట పోలీస్ స్టేషన్​లో నాలుగు కేసులు నమోదయ్యాయి.

అజారుద్దీన్​​పై ఫిర్యాదు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details