రాజధానితో పాటు ఇతర ప్రాజెక్టులపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సూచనలు, అభిప్రాయాలు స్వీకరించనుంది. ఈ-మెయిల్, లేఖల ద్వారా అభిప్రాయాలు పంపాలని జీఎన్ రావు కమిటీ వెల్లడించింది. వచ్చే నెల 12వ తేదీ వరకు ప్రజలు తమ సూచనలు, అభిప్రాయాలు పంపవచ్చని సూచించింది.ఎక్స్పర్ట్ కమిటీ 2019 ఎట్ జీమెయిల్ డాట్కామ్ (expertcommittee2019@gmail.com)కు మెయిల్ చేయాలని తెలిపింది. పటమటలోని నిపుణుల కమిటీ కార్యాలయానికి పోస్టు ద్వారా కూడా అభిప్రాయాలను పంపవచ్చని పేర్కొంది.
అభిప్రాయాలు స్వీకరించనున్న ప్రభుత్వ నిపుణుల కమిటీ - జీఎన్ రావు కమిటీ వార్తలు
రాజధానితో పాటు ఇతర ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ అభిప్రాయాలు స్వీకరించేందుకు సిద్ధమైంది. ఇందుకు వచ్చే నెల 12ను చివరితేదీగా నిర్ధరించింది.
![అభిప్రాయాలు స్వీకరించనున్న ప్రభుత్వ నిపుణుల కమిటీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4892190-801-4892190-1572266933317.jpg)
Committee of Experts who will adopt opinions on capital city amaravathi
ఇదీ చదవండి : రాఘవాచారి మృతి పట్ల సీఎం సహా ప్రముఖుల సంతాపం
Last Updated : Oct 28, 2019, 7:37 PM IST