కోడెల ఆత్మకు శాంతి కలగాలి: సీఎం జగన్
మాజీ సభాపతి కోడెల మృతి పట్ల గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్ సంతాపం తెలిపారు.
Published : Sep 16, 2019, 2:55 PM IST
Published : Sep 16, 2019, 2:55 PM IST
|Updated : Sep 16, 2019, 3:44 PM IST
కోడెల శివప్రసాదరావు బలవన్మరణంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సంతాపం తెలిపారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజలకు ఎనలేని సేవలందించిన నేత దూరమవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభాపతిగా నవ్యాంధ్రకు కోడెల శివప్రసాదరావు చేసిన సేవలను ఎప్పటికీ చిరస్మరణీయమన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు గవర్నర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఘటనపై.. సీఎం జగన్...దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోడెల కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. ప్రముఖ వైద్యుడిగా... సుదీర్ఘ రాజకీయ జీవితంలోన ప్రజలకు సేవలందించారని కీర్తించారు. కోడెల శివప్రసాదరావు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.