ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పడవ ప్రమాదల నివారణకు 9 కంట్రోల్ రూమ్​లు ఏర్పాటు - latest news on boat accidents

పడవ ప్రయాణాలు నివారించేందుకు పర్యటక శాఖ చర్యలు చేపడుతుంది. పడవ ప్రయాణాలు సాగేందుకు వీలుగా పర్యటకశాఖ తొమ్మిది కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేసింది. ఈనెల 18వ తేదీ ఉదయం 10.30 గంటలకు ఈ కేంద్రాలను ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి ప్రారంభించనున్నారు.

cm to start 9 control rooms to prevent boat accidents
పడవ ప్రమాదల నివారణకు చర్యలు

By

Published : Jun 16, 2020, 8:13 PM IST

Updated : Jun 16, 2020, 9:44 PM IST

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రమాదరహితంగా పడవ ప్రయాణాలు సాగేందుకు వీలుగా పర్యటకశాఖ తొమ్మిది కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేసింది. ఈనెల 18వ తేదీ ఉదయం 10.30 గంటలకు ఈ కేంద్రాలను సీఎం జగన్ తన కార్యాలయం నుంచి దృశ్యవీక్షణ ద్వారా ప్రారంభిస్తారని పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టరు ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.

గత ఏడాది సెప్టెంబరు నెలలో కచ్చలూరు వద్ద గోదావరి నదిలో వశిష్ట పున్నమి రాయల్‌ పడవ ప్రమాదం జరిగిన తర్వాత నుంచి పడవ ప్రమాదాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఆ తర్వాత సురక్షితంగా పడవ ప్రయాణం సాగేందుకు రక్షణ చర్యలపై సూచనలు చేసేందుకు ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని నియమించింది. కమిటీ సిఫార్సుల ప్రకారం పశ్చిమగోదావరి జిల్లాలోని సింగనపల్లి, పేరంటాలపల్లి, పోచవరం, తూర్పుగోదావరి జిల్లలోని గండిపోచమ్మ, రాజమహేంద్రవరం, విశాఖపట్నంలోని రుషికొండ బీచ్‌, గుంటూరు జిల్లాలోని నాగార్జునసాగర్‌ బోటింగ్‌ పాయింట్‌, కర్నూలు జిల్లాలోని శ్రీశైలం బోటింగ్‌ పాయింట్‌, విజయవాడలోని బెరంపార్కు వద్ద మొత్తం తొమ్మిది కంట్రోల్‌రూములను ఏర్పాటు చేశారు. వీటిని ఏకకాలంలో ఈనెల 18న ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.

ప్రతి కంట్రోల్‌రూములోనూ రెవెన్యూ శాఖకు చెందిన ఓ మేనేజరు, జలవనరులశాఖ నుంచి ఓ అధికారి, పర్యాటక శాఖ నుంచి ఒక ఆపరేటర్‌, తనిఖీ బృందం, లైఫ్‌గార్డ్స్‌, ఈతగాళ్లు, పోలీసుశాఖ నుంచి భద్రత సిబ్బంది ఉంటారు. వీరు ఎప్పటికప్పుడు జలరవాణా పాయింట్ల నుంచి పడవలను పంపించడం, వాతావరణ హెచ్చరికలు, బోటులోని సిబ్బంది, ప్రయాణికుల వివరాలను సక్రమంగా నమోదు చేయడం, పడవల రిజిస్ట్రేషన్‌, లైసెన్సులు, సామర్ధ్యం తనిఖీలు నిర్వహించడం... ప్రమాదాలు జరిగితే వెంటనే రక్షించేందుకు తగిన సామగ్రి అందుబాటు, భద్రత చర్యలు పరిశీలన వంటి విధులను ఈ కేంద్రాల్లోని సిబ్బంది నిర్వహిస్తారు.

ఇదీ చదవండి: ఇకపై కాగిత రహిత కార్యాలయాలు

Last Updated : Jun 16, 2020, 9:44 PM IST

ABOUT THE AUTHOR

...view details