ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జనవరి లేదా ఫిబ్రవరి నుంచి రచ్చబండ.. సీఎం జగన్​ నిర్ణయం

ప్రభుత్వంలోని వివిధ శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులతో సీఎం జగన్​ సమీక్ష జరిపారు. 40 వేల కోట్ల రూపాయల బిల్లులను గత ప్రభుత్వం పెండింగ్​లో పెట్టి రాష్ట్రాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందన్నారు.

By

Published : Nov 22, 2019, 2:22 PM IST

నేను ఏదైనా హామీ ఇస్తే అది ప్రభుతమిచ్చే హామీనే: సీఎం

ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు అధిగమించడంపై దృష్టి పెట్టాలని సీఎం జగన్​ పేర్కొన్నారు. అనవసర వ్యయాన్ని అధికారులు తగ్గించాలని సూచించారు. ప్రభుత్వం ఖర్చు పెట్టే నిధులు ప్రయోజనకరంగా ఉండాలన్నారు. సామాన్యులపై భారం మోపకుండా ఆదాయం పెంచుకోవడంపై యంత్రాంగం ఆలోచన చేయాలని తెలిపారు. జిల్లాల పర్యటనల సందర్భంగా ఇచ్చే హామీల అమలుపై అధికారులు దృష్టి కేంద్రీకరించాలని ఆదేశించారు.

జనవరి లేదా ఫిబ్రవరి నుంచి రచ్చబండ కార్యక్రమం ప్రారంభించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఏ పనికైనా శంకుస్థాపన చేస్తే 4 వారాల్లోగా పనులు ప్రారంభం కావాలని తెలిపారు. కేంద్రం నుంచి వీలైనన్ని నిధులు సమకూర్చుకోవాలన్నారు. సీఎంగా ఏదైనా హామీ ఇస్తే అది ప్రభుత్వమిచ్చే హామీగానే భావించాలని అధికారులకు తెలియజేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details