ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు దిల్లీ పర్యటన - దిల్లీకి వెళ్లనున్న ముఖ్యమంత్రి కేసీఆర్​

శుక్రవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​ దిల్లీకి వెళ్లనున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది.

సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్

By

Published : Dec 11, 2020, 7:26 AM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. మూడు రోజుల పర్యటన కోసం శుక్రవారం ఉదయం ఆయన ప్రత్యేక విమానంలో హస్తిన బయల్దేరనున్నారు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, పౌరసరఫరాల శాఖ మంత్రి నరేంద్ర తోమర్ తదితరులను సీఎం కేసీఆర్ కలిసే అవకాశం ఉంది.

తెలంగాణకు చెందిన పలు అంశాలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లనున్నారు. అవకాశం ఉంటే ప్రధానమంత్రి నరేంద్రమోదీని కూడా కలుస్తారని తెలుస్తోంది. దిల్లీలో తెరాస కార్యాలయ నిర్మాణం కోసం ఇప్పటికే స్థలాన్ని కేటాయించిన నేపథ్యంలో ఆ స్థలాన్ని పరిశీలించనున్నట్లు సమాచారం.

ఇదీ చూడండి: అనంత స్వర్ణమయానికి స్వస్తి: తితిదే తీర్మానం

ABOUT THE AUTHOR

...view details