ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

భాజపా 8 ఏళ్ల పాలనలో.. దేశం సర్వనాశనం - కేసీఆర్ - సీఎం కేసీఆర్ యాదాద్రి టూర్

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి పిచ్చి ముదిరి.. పిచ్చి పిచ్చి చట్టాలు తీసుకువస్తోందని తెలంగాణ సీఎం కేసీఆర్ విమర్శించారు. 8 ఏళ్ల భాజపా పాలన దేశాన్ని సర్వనాశనం చేసిందని ధ్వజమెత్తారు.

CM kcr fires on modi government
CM kcr fires on modi government

By

Published : Feb 12, 2022, 10:32 PM IST

Cm kcr yadadri tour speech: భువనగిరి జిల్లా అవుతుందని కలలో కూడా మనం అనుకోలేదని తెలంగాణ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. యాదాద్రి జిల్లా రాయగిరిలో ఏర్పాటు చేసిన తెరాస బహిరంగ సభలో ప్రసంగించిన కేసీఆర్.. పరిపాలన సంస్కరణలో భాగంగానే భువనగిరి జిల్లా ఏర్పాటు చేసుకున్నట్లు స్పష్టం చేశారు. నాడు భువనగిరి ప్రజలు ఉద్యమంలో తన వెంట నడిచారని వెల్లడించారు. కొద్దిరోజుల్లోనే ఈ ప్రాంతానికి కాళేశ్వరం జలాలు వస్తాయన్నారు. మిషన్ భగీరథతో మంచినీళ్ల బాధలు తొలగిపోయాయని తెలిపారు. భగీరథ ద్వారా తాగునీరు ప్రతి గడపకు అందుతున్నాయని అభిప్రాయపడ్డారు. భువనగిరి ప్రజలు బెబ్బులిలా తెలంగాణ కోసం పోరాటం చేశారని గుర్తు చేసుకున్నారు. సాగుకు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని.. రైతుబంధు, రైతు బీమా అమలు ఎలా జరుగుతుందో ప్రజలకు తెలుసన్నారు. అనేక రంగాల్లో అభివృద్ధి సాధించి రాష్ట్రం ముందుకు సాగుతోందని ప్రకటించారు. తలసరి ఆదాయంలోనూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నామని చెప్పారు.

సీఎం కేసీఆర్

కేసీఆర్‌ భయపడతాడా?

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి పిచ్చి ముదిరి పిచ్చి పిచ్చి చట్టాలు తెస్తున్నారు. నల్లచట్టాలు తెచ్చి ఏడాది పాటు రైతులను ఏడిపించారు. దిల్లీలో సరిహద్దుల్లో రైతులపై లాఠీఛార్జి చేశారు. 5 రాష్ట్రాల్లో ఎన్నికలు వస్తే రైతులకు భయపడి నల్ల చట్టాలను రద్దు చేస్తున్నామని ప్రధాని ప్రకటించి దేశానికి క్షమాపణలు చెప్పారు. విద్యుత్‌ సంస్కరణలు అమలు చేస్తేనే డబ్బులిస్తాం.. లేకపోతే ఇవ్వమని చెబుతున్నారు. విద్యుత్‌ మోటార్ల వద్ద మీటర్లు పెడదామా? నేను చనిపోయినా సరే.. విద్యుత్‌ సంస్కరణలు ఒప్పకోను. నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని తరిమి తరిమి కొట్టాలి. 8 ఏళ్ల భాజపా పాలన దేశాన్ని సర్వనాశనం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఏదైనా మంచి చేస్తే మనవరకూ రావాలి కదా. ఏ రంగానికి మంచి చేశారు... ఎవరికి లాభం జరిగింది. ఇది మాట్లాడితే.. కేసీఆర్‌ నీ సంగతి చూస్తామంటున్నారు. ఏం చూస్తారు నా.. సంగతి. కేసీఆర్‌ భయపడతాడా? భయపడితే తెలంగాణ వచ్చేదా? విద్యార్థులు, మేధావులు ఆలోచన చేయాలి. - తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్

దేశం ఎవడి అయ్య సొత్తు కాదు..
cm kcr fires on central govt: ఎనిమిదేళ్ల పాలనలో దేశాన్ని భాజపా సర్వనాశనం చేసిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆరోపించారు. దేశం ఎవడి అయ్య సొత్తు కాదని మండిపడ్డారు. దేశాన్ని నాశనం చేస్తే ఎవరూ చూస్తూ ఊరుకోరని ధ్వజమెత్తారు. ''కర్ణాటకలో విద్యార్థులపై రాక్షసంగా ప్రవర్తించవచ్చా? సాఫ్ట్‌వేర్‌ రంగానికి ఇండియన్‌ సిలికాన్‌ వ్యాలీ బెంగళూరు మొదటి స్థానంలో ఉంటే రెండో స్థానంలో హైదరాబాద్‌ ఉంది. సిలికాన్‌ వ్యాలీని కశ్మీర్‌ వ్యాలీగా మారిస్తే పెట్టుబడులు ఎవరు పెడతారు? దేశంలో నిరుద్యోగుల సంఖ్య పెరిగింది నిజం కాదా? పారిశ్రామిక ఉత్పత్తులు పడిపోతున్నాయి.'' అంటూ కేంద్రంపై ఫైర్ అయ్యారు.

మత పిచ్చి అవసరమా?
cm kcr on modi: దేశంలో 15.. 16లక్షల పరిశ్రమలు మూతపడిన విషయం వాస్తవం కాదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 140 కోట్ల మంది ఉన్న ఈ దేశంలో మత విద్వేషంతో ఎవరి కడుపు నిండుతుందన్నారు. మత పిచ్చి అవసరమా అని ప్రశ్నించారు. మోదీ.. ఏరంగానికి మేలు చేశారని ప్రశ్నించారు. మోదీ పాలనలో ఇప్పటికే దేశం నష్టపోయిందని ఆరోపించారు. రాజకీయంగా స్పందించకపోతే దేశం నాశనమైతుందని అన్నారు. చాలా బాధతో ఈ మాట చెబుతున్నా.. అమెరికాలాంటి దేశాల్లో మత పిచ్చి ఉండదు.. అందుకే అభివృద్ధి చెందిందని వివరించారు.

ఇదీ చదవండి :CM KCR Yadadri Tour Speech: దేశం తిరోగమిస్తున్నా... తెలంగాణ పురోగమిస్తోంది: సీఎం కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details