ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 16, 2020, 9:28 PM IST

Updated : Feb 16, 2020, 11:28 PM IST

ETV Bharat / city

'ఐప్యాక్' డైరెక్టర్ వివాహ వేడుకకు హాజరైన సీఎం జగన్

ఐప్యాక్ డైరెక్టర్ రిషి వివాహానికి సీఎం జగన్ హాజరయ్యారు. లఖ్‌నవూలో జరిగిన ఈ వివాహ వేడుకకు సతీసమేతంగా సీఎం జగన్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

cm-jagan-went-to-lucknow-for-attend-to-a-marriage-function
cm-jagan-went-to-lucknow-for-attend-to-a-marriage-function

ఐ-ప్యాక్ డైరెక్టర్ వివాహ వేడుకకు సీఎం జగన్ హాజరు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్​మోహన్ రెడ్డి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లఖ్‌నవూకు వెళ్లారు. ఆదివారం సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి లఖ్‌నవూ చేరుకున్నారు. అక్కడి తాజ్ హోటల్​లో ఇండియన్​ పొలిటికల్ యాక్షన్ కమిటీ(ఐప్యాక్)డైరెక్టర్ రుషి వివాహం జరిగింది. ఈ వేడుకకు తన సతీమణి వైఎస్ భారతి సమేతంగా సీఎం జగన్ హాజరయ్యారు. మొన్నటి ఎన్నికల్లో వైకాపా సలహాదారుగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్​దే ఈ 'ఐప్యాక్'.

ఇదీ చదవండి

Last Updated : Feb 16, 2020, 11:28 PM IST

ABOUT THE AUTHOR

...view details