ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 13, 2020, 4:12 AM IST

ETV Bharat / city

నేడు గవర్నర్​ను కలవనున్న సీఎం జగన్​

ముఖ్యమంత్రి జగన్ ఇవాళ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్​తో భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు విజయవాడలోని రాజ్​ భవన్​లో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.

cm jagan to meet governor
cm jagan to meet governor

సీఎం జగన్ ఇవాళ ఉదయం రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్​ను కలవనున్నారు. దీపావళి పండగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు ముఖ్యమంత్రి విజయవాడలోని రాజ్​భవన్​కు వెళ్తునట్లు సీఎంవో వర్గాలు తెలిపాయి. సీఎం వెంట ఆయన సతీమణి వైఎస్ భారతి కూడా వెళ్లనున్నట్లు తెలిసింది. గవర్నర్​తో భేటీ సందర్భంగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు, రాష్ట్ర ఎన్నికల కమిషనరు, న్యాయస్థానంలో కేసులు తదితర విషయాలపైనా ముఖ్యమంత్రి చర్చించే అవకాశం ఉందని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details