దిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి జగన్ - LATEST NEWS ON ap cm
సీఎం జగన్ గురువారం ఆకస్మికంగా దిల్లీ వెళ్లారు. నిన్న ఉదయం అనంతపురం జిల్లా కియా కార్ల పరిశ్రమ కార్యక్రమంలో పాల్గొని, తిరిగి తాడేపల్లికి చేరుకోవటం వరకే పర్యటన తొలుత ఖరారైంది.మధ్యాహ్నం నుంచి రిజర్వుగా షెడ్యూల్లో పేర్కొన్నారు. అయితే అనంతపురం కార్యక్రమం ముగిసే సమయానికి దిల్లీ పర్యటన షెడ్యూల్ వచ్చింది. సాయంత్రమే ఆయన బయలుదేరి దిల్లీ వెళ్లారు. రాత్రి 10.30-11.00 గంటల మధ్య కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలుస్తారని భావించినా...అపాయింట్మెంట్ ఖరారు కాలేదు. దీంతో రాత్రి 12 గంటల వరకు అమిత్ షాను కలవలేదు.1జన్పథ్లో జగన్ను వైకాపా ఎంపీలు మర్యాదపూర్వకంగా కలిశారు
![దిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి జగన్ CM JAGAN TO DELHI](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5278027-301-5278027-1575542480679.jpg)
సీఎం జగన్ దిల్లీ పర్యటన.
.
Last Updated : Dec 6, 2019, 6:12 AM IST