ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రూ. 34 వేల కోట్లతో వసతులు రికార్డే: సీఎం జగన్​ - జగనన్న కాలనీలపై సీఎం జగన్​ సమీక్ష

జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాల పనుల్లో అవినీతి, అక్రమాలకు తావు ఉండకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్​ ఆదేశించారు. పనుల్లో నాణ్యతకు పెద్దపీట వేయాలని, పనులను నిర్దేశిత సమయంలో శరవేగంగా పూర్తి చేయాలని నిర్దేశించారు. ఇళ్ల నిర్మాణంలో నాణ్యతపై ఫిర్యాదులు, సలహాలకు ప్రత్యేక నెంబరు కేటాయించాలని అధికారులను ఆదేశించారు.

cm jagan review on housing
cm jagan review on housing

By

Published : Jun 24, 2021, 6:11 PM IST

Updated : Jun 25, 2021, 4:40 AM IST

వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో రూ.34వేల కోట్లతో మౌలిక వసతులను కల్పించడం ఒక కల అని, దానిని నిజం చేయాలని తాను తపిస్తున్నానని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ‘నా కల మీ అందరి కల కావాలి. మనందరి కల పేదల కల కావాలి. అప్పుడే ఈ కార్యక్రమం సాకారమవుతుంది’ అని పేర్కొన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా గృహ నిర్మాణంపై సీఎం జగన్‌ గురువారం సమీక్షించారు.

'గతంలో రాష్ట్రంలోగానీ, దేశంలోగానీ మౌలిక సదుపాయాల కల్పనకు ఇంత భారీ మొత్తంలో వెచ్చించిన దాఖలాల్లేవు. ఇలాంటి పెద్ద కార్యక్రమాన్ని చేపట్టాలన్న ఆలోచన కూడా గతంలో ఎవరూ చేయలేదు. పేదలకు అత్యుత్తమ జీవన ప్రమాణాలను అందించాలన్నదే మన లక్ష్యం. దేశం మొత్తం మనవైపు చూస్తోంది. పేదల కోసం నిర్మిస్తున్న కాలనీలను ఉత్తమ ప్రమాణాలున్న ఆవాసాలుగా తీర్చిదిద్దాలి. ఇందుకోసం యంత్రాంగమంతా సంకల్పంతో, అంకితభావంతో శ్రమించాలి. అప్పుడే లక్ష్యాన్ని పూర్తి చేయగలుగుతాం.' అని సీఎం పేర్కొన్నారు.

రవాణా ఛార్జీలు పెరగకూడదు

భారీ ఎత్తున చేపడుతున్న ఇళ్ల నిర్మాణాన్ని దృష్టిలో పెట్టుకుని రవాణా ఛార్జీలు సహా ఇతరత్రా సామగ్రి ధరలు అమాంతం పెరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. కాలనీల్లో ఇళ్ల నిర్మాణానికి అవసరమైన విద్యుత్తు, నీటి వసతి కల్పన వారంలో అన్ని లేఅవుట్లలో పూర్తి కావాలని సూచించారు. ‘కాలనీల్లో చేపట్టే పనుల్లో నాణ్యతకు పెద్దపీట వేయాలి. అవినీతికి తావు ఉండకూడదు. నాణ్యతపై ఫిర్యాదులు, సలహాలకు ప్రత్యేక నంబరును ఏర్పాటు చేయాలి. ప్రతి లేఅవుట్‌లో దీనికి సంబంధించి ఒక బోర్డు ఉండాలి. వచ్చిన సమాచారం ఆధారంగా ఎప్పటికప్పుడు సమీక్షించాలి’ అని ఆదేశించారు. ‘వచ్చే ఏడాది జూన్‌ నాటికి మొదటి విడత చేపట్టిన 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేస్తాం’ అని సమీక్ష సందర్భంగా సీఎం జగన్‌కు అధికారులు వివరించారు.

నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంపై సీఎం జగన్‌ సమీక్ష

ఇదీ చదవండి:

RRR letter: 'పట్టింపులకు పోకండి.. బోర్డు పరీక్షలు ఇప్పటికైనా రద్దు చేయండి'

Last Updated : Jun 25, 2021, 4:40 AM IST

ABOUT THE AUTHOR

...view details