ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అత్యాచార బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు: సీఎం జగన్ - sc, st atrocity cases in ap

ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో హత్యకు గురైన కుటుంబాలతో పాటు అత్యాచారానికి గురైన కుటుంబాలకూ ఉద్యోగాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఇక నుంచి క్రమం తప్పకుండా ఈ చట్టం అమలు, పనితీరుపై సమీక్ష చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ హైపవర్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి హాజరైన సీఎం.. ప్రతీ మూడు నెలలకు ఓసారి జిల్లా స్థాయిలో కమిటీలు సమావేశం కావాలని ఆదేశాలిచ్చారు. తదుపరి సమీక్షా సమావేశంలో మునుపటి నిర్ణయాల ప్రగతిపై చర్చించాలని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద సొంత శాఖకు చెందిన వారైనా పోలీసు శాఖ కేసులు పెట్టి చర్యలు తీసుకుంటుందని సీఎం వెల్లడించారు.

cm jagan order dgp to solve sc, st atrocity cases quickly
cm jagan order dgp to solve sc, st atrocity cases quickly

By

Published : Feb 4, 2021, 4:36 PM IST

Updated : Feb 4, 2021, 7:58 PM IST

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో హత్యకు గురైన కుటుంబాలతో పాటు అత్యాచారానికి గురైన కుటుంబాలకు కూడా ఉద్యోగాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. క్రమం తప్పకుండా ఈ చట్టం అమలు, పనితీరుపై సమీక్ష చేయాలని అధికారులను, రాష్ట్రస్థాయి పర్యవేక్షణా కమిటీని ఆదేశించారు. సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో కీలకమైన అంశాలను సీఎం ప్రస్తావించారు. 2013 నుంచి ఇప్పటి వరకూ ఈ హైపవర్ కమిటీ సమావేశాలు జరక్కపోవటం శోచనీయమని వ్యాఖ్యానించారు. ప్రతీ మూడు నెలలకూ జిల్లాస్థాయి కమీటీలు సమావేశం కావాలని ఆదేశించారు. తదుపరి సమావేశాల్లో మునుపటి నిర్ణయాల అమలును పరిశీలంచాలని స్పష్టం చేశారు. ఈ చట్టం కింద కేసులు నమోదు అయితే సొంత అధికారులపై కూడా పోలీసు శాఖ చర్యలు తీసుకుంటుందని సీఎం స్పష్టం చేశారు. చట్టం అమలు తీరుపై చిత్తశుద్ధికి ఇది నిదర్శనమవుతుందని వెల్లడించారు.

చట్టానికి ఎవరూ అతీతులు కారు..

ఎస్సీ, ఎస్టీ చట్టానికి సంబంధించి రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా పోలీసు శాఖ కఠిన నిర్ణయాలు తీసుకుందని సీఎం అన్నారు. తప్పు చేసినవారు తమవారైనా సరే.. సంబంధిత పోలీసు అధికారులపై ఆ శాఖ చర్య తీసుకుందన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని నిరూపించారని. ఎస్సై, సీఐలపై చర్యలు తీసుకోవటం వల్ల ప్రజలకు దగ్గరయ్యారని సీఎం పేర్కొన్నారు. వేధింపులకు గురైన కేసుల్లో బాధితులకు ఆర్థిక సహాయాన్ని ఎప్పటికప్పుడు అందిస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసుల్లో అత్యాచారం, హత్యకు గురైన కుటుంబాలకూ ఉద్యోగాలు కల్పించాలని ఎలాంటి జాప్యానికి తావులేదని సీఎం స్పష్టం చేశారు. బాధితులకు అందుబాటులో భూమి ఉంటే ఇవ్వాలని లేని పక్షంలో సేకరించి పంపిణీ చేయాలని సీఎం ప్రతిపాదించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పర్యవేక్షణకు రాష్ట్రంలో ఓ నిర్ధుష్ట ప్రణాళిక ఉండాలని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద నమోదైన కేసుల్లో దర్యాప్తు ప్రగతిపై ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలని సీఐడీ విభాగాన్ని ఆదేశించారు. అణగారిన వర్గాలకు పోలీసులు దగ్గర కావాలన్నారు.

వారంలో ఓ మారు..

వారంలో ఓ మారు సచివాలయాల సందర్శనకు వెళ్లే కలెక్టర్లు ఎస్సీ, ఎస్టీ కాలనీల్లోకి కూడా వెళ్లాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ కమిటీల సభ్యులు ఇచ్చిన సిఫార్సులపైనా అధ్యయనం చేయాలని.. అలాగే ప్రత్యేక కోర్టుల ఏర్పాటుపైనా, న్యాయవాదుల నియామకంపైనా, బాధితులకు అందాల్సిన సహాయంపైనా దృష్టి పెట్టాలన్నారు. అణగారిన వర్గాలకు సాధికారిత రావాలన్న దిశగానే నిర్ణయాలు తీసుకున్నామన్నారు. అందుకే రాష్ట్ర హోంమంత్రి పదవి దళిత మహిళకు ఇచ్చామని తెలిపారు. అలాగే విద్యాశాఖనూ దళితులకే ఇచ్చామని, డీజీపీ కూడా ఎస్టీ వర్గానికి చెందిన వారన్నారు. వీరి నియామకంతో వ్యవస్థలో మార్పులు తీసుకు వస్తున్నామని సీఎం అన్నారు.

హైపవర్ విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న సీఎం జగన్

వివిధ కేసుల్లో బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇచ్చామని షెడ్యూలు కులాల జాతీయ కమిషన్ డైరెక్టర్ సీఎంకు తెలిపారు. బాధితుల వ్యక్తిగత గోప్యతను దృష్టిలో ఉంచుకుని ఆర్థిక సహాయ అంశాన్ని ఎక్కడా వార్తల్లో కనిపించనీయకుండా సున్నితంగా వ్యహరించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:హైకోర్టు తరలింపుపై హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వాలదే నిర్ణయం: కేంద్రం

Last Updated : Feb 4, 2021, 7:58 PM IST

ABOUT THE AUTHOR

...view details