ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 9, 2020, 5:21 PM IST

Updated : Jun 9, 2020, 5:29 PM IST

ETV Bharat / city

'సమస్యలు విన్నారు.. సానుకూలంగా స్పందించారు'

రాష్ట్రంలో సినిమాల చిత్రీకరణకు ప్రభుత్వం అనుమతిచ్చిందని సినీ నటుడు చిరంజీవి తెలిపారు. సినీ పరిశ్రమ అభివృద్ధి, సమస్యలు, పరిష్కారం పై సీఎం జగన్‌ను.. చిరంజివి ఆధ్వర్యంలోని తెలుగు సినీ ప్రముఖుల కలిశారు.

cm jagan meet with  Cinema celebrities
మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి

ఏడాది కాలంగా ముఖ్యమంత్రి జగన్‌ను కలవాలని అనుకున్నామని...ఇప్పుడు కలిసి తమ సంతోషాన్ని తెలియజేశామని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. సినీపరిశ్రమ అభివృద్ధికి సహకరించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.

సినిమాల చిత్రీకరణకు సీఎం జగన్ అంగీకరించారని చిరంజీవి చెప్పారు. నంది పురస్కారాలకు ప్రభుత్వం ప్రోత్సాహం ఉండాలని కోరగా... 2019-20 సంవత్సరాలకు నంది అవార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకొచ్చిందన్నారు. థియేటర్ల టికెట్లపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారని.. అదే విధంగా సినిమా టికెట్ల జారీలో పారదర్శకత ఉండాలని కోరినట్లు చిరంజీవి తెలిపారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి సినీపరిశ్రమ కట్టుబడి ఉందని చిరంజీవి అన్నారు.

Last Updated : Jun 9, 2020, 5:29 PM IST

ABOUT THE AUTHOR

...view details