ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కృష్ణా కరకట్ట రహదారి విస్తరణ పనులకు.. సీఎం శంకుస్థాపన - krishna karakatta development works

కృష్ణా కరకట్ట రహదారి విస్తరణ పనులకు సీఎం జగన్​ శంకుస్థాపన చేశారు. రూ.150 కోట్ల వ్యయంతో కరకట్ట విస్తరణ పనులు చేపట్టనున్నారు. 5 కి.మీ. పొడవున, 10 మీటర్ల వెడల్పుతో రహదారి నిర్మాణానికి ప్రణాళికలు చేపట్టారు.

CM jagan layed foundation stone for Krishna  karakatta road widening works
CM jagan layed foundation stone for Krishna karakatta road widening works

By

Published : Jun 30, 2021, 11:56 AM IST

Updated : Jun 30, 2021, 1:33 PM IST

కృష్ణా కరకట్ట రహదారి విస్తరణ పనులకు సీఎం శంకుస్థాపన

కృష్ణా కరకట్ట రహదారి విస్తరణ పనులకు సీఎం జగన్​ శంకుస్థాపన చేశారు. ఉండవల్లిలోని జీరో పాయింట్ వద్ద పైలాన్ ఆవిష్కరించి ప్రనులకు శ్రీకారం చుట్టారు. కరకట్ట రహదారి విస్తరణ ప్రాజెక్టు శిలాఫలకం ఆవిష్కరించారు.

ప్రకాశం బ్యారేజీ దాటిన తర్వాత కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం వద్ద నుంచి రాయపూడి వరకు 15 కిలోమీటర్ల పొడవునా రెండు వరుసల రహదారిగా అభివృద్ధి చేయనున్నారు. దీనికి కావాల్సిన రూ.150 కోట్ల నిధులను అమరావతి స్మార్ట్‌ అండ్‌ సస్టైనబిలిటీ సిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ సమకూరుస్తోంది. మేఘా ఇంజినీరింగ్‌ కంపెనీ పనులను చేపట్టనుంది. విస్తరణలో భాగంగా పాదచారులు నడిచేందుకు వీలుగా రెండు వైపులా ఒకటిన్నర మీటర్ల మేర మార్గం ఏర్పాటు చేయనున్నారు. 15 కి.మీ. పొడవున, 10 మీటర్ల వెడల్పుతో రహదారి నిర్మాణానికి ప్రణాళికలు చేపట్టారు.

Last Updated : Jun 30, 2021, 1:33 PM IST

ABOUT THE AUTHOR

...view details