గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మించిన ప్రజాశక్తి భవనాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్... వర్చువల్ విధానంలో ప్రారంభించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి కంప్యూటర్లో బటన్ నొక్కిన సీఎం... ప్రజాశక్తి దినపత్రిక కార్యాలయం శిలాఫలకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజాశక్తి దినపత్రిక యాజమాన్యం, సిబ్బందికి హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రజావ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు జీవీడీ కృష్ణమోహన్, ఎమ్మెల్సీ లక్ష్మణరావు, సీపీఎం పోలిట్బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు పాల్గొన్నారు.
ప్రజాశక్తి కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం జగన్ - ప్రజాశక్తి కార్యాలయం వార్తలు
తాడేపల్లిలో నిర్మించిన ప్రజాశక్తి భవనాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఆయనతో పాటు సీపీఎం పోలిట్బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు పాల్గొన్నారు.
![ప్రజాశక్తి కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం జగన్ cm-jagan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9452689-968-9452689-1604657249298.jpg)
cm-jagan
Last Updated : Nov 6, 2020, 4:36 PM IST