ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అనుకున్న సమయానికంటే ముందుగానే.. దిల్లీకి సీఎం జగన్

By

Published : Sep 22, 2020, 12:56 PM IST

సీఎం జగన్ దిల్లీ పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి. గతంలో ప్రకటించిన షెడ్యూల్ కన్నా.. 2 గంటల ముందుగానే ముఖ్యమంత్రి దిల్లీకి చేరనున్నారు. ప్రధాని మోదీ సహా కొందరు కేంద్ర మంత్రులతో సీఎం సమావేశమయ్యే అవకాశం ఉంది.

cm jagan delhi tour
cm jagan delhi tour

ముఖ్యమంత్రి జగన్ దిల్లీ పర్యటన సమయంలో స్వల్ప మార్పు చేసినట్లు.. సీఎంవో తెలిపింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ కన్నా.. 2 గంటలు ముందుగానే సీఎం దిల్లీకి వెళ్తారని.. వెల్లడించింది. ఒంటిగంటకే బయల్దేరి.. 3 గంటలకు దిల్లీ చేరుకుంటారని తెలిపింది.

దిల్లీ పర్యటనలో.. ప్రధాని నరేంద్ర మోదీ సహా కొందరు కేంద్రమంత్రులతో సీఎం సమావేశమయ్యే అవకాశం ఉంది. ముఖ్యమంత్రితో పాటు.. అడ్వకేట్ జనరల్ సహా ఇతర ఉన్నతాధికారులు దిల్లీ వెళ్లనున్నారు.

ABOUT THE AUTHOR

...view details