ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఆ అధికారులపై నిర్దిష్ట కాలంలో చర్యలు తీసుకోవాలి: సీఎం

By

Published : Aug 24, 2020, 3:03 PM IST

Updated : Aug 24, 2020, 3:09 PM IST

ప్రభుత్వ శాఖల్లో అవినీతికి పాల్పడితే వెంటనే తగిన చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు దిశ తరహాలో అసెంబ్లీలో బిల్లు తీసుకురావాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

cm jagan
cm jagan

అధికారులు లంచం తీసుకుంటూ దొరికితే నిర్దిష్ట సమయంలో చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ‘దిశ’ తరహాలో అసెంబ్లీలో బిల్లు తీసుకురావాలని నిర్ణయించారు. 1902 నెంబర్‌కు వచ్చే అవినీతి అంశాలు అనిశాకు చెందిన 14400కు బదలాయింపు చేయాలని స్పష్టం చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల నుంచి వచ్చే ఫిర్యాదులు కూడా అనుసంధానం చేయాలని ఆదేశించారు.

'ఎమ్మార్వో, ఎండీఓ, సబ్‌రిజిష్ట్రార్, మున్సిపల్, టౌన్‌ ప్లానింగ్‌ విభాగాల్లో అవినీతిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.ప్రభుత్వంలోని ప్రతి విభాగంలోనూ రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించాలి. టెండర్‌ విలువ రూ.కోటి దాటితే రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియ చేపట్టాల్సిందే'- ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి

Last Updated : Aug 24, 2020, 3:09 PM IST

ABOUT THE AUTHOR

...view details