కొవిడ్ నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్షించారు. ప్లాస్మా థెరపీతో మంచి ఫలితాలు ఉంటే ప్రోత్సహించాలని అన్నారు. ఈ మేరకు ప్లాస్మా ఇచ్చేందుకు ముందుకు వచ్చిన వారికి రూ. 5 వేలు ఇవ్వాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ప్లాస్మా థెరపీ పై బాగా అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని సూచించారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే కథనాల్లో నిజాలు ఉంటే...వాటిని పాజిటివ్ గా తీసుకుని సమస్యలను పరిష్కరించాలని చెప్పారు. సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలలను తెరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం వెల్లడించారు.
ప్లాస్మా ఇచ్చేవారికి రూ.5వేలు ఇవ్వండి: సీఎం జగన్ - కరోనా వైరస్ వార్తలు
![ప్లాస్మా ఇచ్చేవారికి రూ.5వేలు ఇవ్వండి: సీఎం జగన్ cm jagan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8243173-792-8243173-1596187997358.jpg)
cm jagan
13:47 July 31
ప్లాస్మా ఇచ్చేవారికి రూ.5వేల రూపాయలు ఇవ్వండి: సీఎం జగన్
'ప్లాస్మా థెరఫీపై బాగా అవగాహన కలించాలి. మంచి ఫలితాలు ఉంటే ప్రోత్సహించండి. ప్లాస్మా ఇచ్చేవారికి రూ.5వేల రూపాయలు ఇవ్వండి. మంచి భోజనం, వారి ఆరోగ్యం కోసం ఈ డబ్బు ఉపయోగపడుతుంది: సెప్టెంబరు 5 నుంచి స్కూళ్లు తెరిచే ప్రయత్నాలు చేస్తున్నాం. సీఎం విద్యాకానుకతో పాటు.. పిల్లలకు మాస్కులు కూడా ఇవ్వాలి.' - ముఖ్యమంత్రి జగన్
ఇదీ చదవండి :
Last Updated : Jul 31, 2020, 3:29 PM IST