ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మోదీ.. రాష్ట్రానికి చేసిందేంటో చెప్పండి. లేదంటే..! - ap elections 2019

''రాష్ట్రానికి ఇప్పటివరకూ ప్రధాని మోదీ ఏమీ చేయలేదు. అభివృద్ధికి సాయం చేయకపోగా.. కక్ష గట్టారు. ధైర్యముంటే రాష్ట్రానికి చేసిన సహాయంపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలి. లేదంటే.. కేంద్రం చేతకాని తీరును మేమే ఎండగడతాం'' - తెదేపా నేతలతో టెలీకాన్ఫరెన్స్​లో చంద్రబాబు

అమరావతి టెలీకాన్ఫరెన్స్​లో సీఎం చంద్రబాబు

By

Published : Mar 30, 2019, 12:40 PM IST

సన్ సెట్ ఏపీ అంటూ కర్నూలు భాజపా ప్రచార సభలోప్రధానిమోదీ చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఏమీ చేయని మోదీ... నిందలు మోపుదామనుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. తెదేపా నేతలతో టెలీ కాన్ఫరెన్స్ చేసిన అధినేత..మోదీ మాట్లాడిన తీరును తప్పుబట్టారు.కష్టపడి అభివృద్ధి చేసుకుంటున్న రాష్ట్రంపై ఇంత అక్కసా అని ఆక్షేపించారు. మోదీ సభకు వైకాపా కార్యకర్తలను తరలించిందని ఆరోపించారు.

ధైర్యముంటే శ్వేతపత్రం విడుదల చేయండి

రాష్ట్రానికి ఇప్పటివరకూ ప్రధాని మోదీ ఏమీ చేయలేదని చంద్రబాబు అన్నారు.అభివృద్ధికి సాయం చేయకపోగా.. కక్ష గట్టారని ఆరోపించారు. ధైర్యముంటే రాష్ట్రానికి చేసిన సహాయంపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే.. కేంద్రం సాయంపై తామే శ్వేతపత్రాన్ని విడుదల చేస్తామని హెచ్చరించారు.

అతి విశ్వాసం వద్దు....

ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి అనే స్ఫూర్తి అందరిలోనూ రావాలని తెదేపా నేతలు, కార్యకర్తలకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.ప్రజల స్పందన బాగుంది కదా అనే అతివిశ్వాసం ఎవరికీ వద్దని హెచ్చరించారు. చివరి క్షణంవరకూ బాగా కష్టపడాలన్నారు. ఈసారి ఇన్‌ఛార్జుల వ్యవస్థ ఉండదని తెలిపారు. ఎవరు ఓడిపోయినా.. పార్టీలో సాధారణ కార్యకర్తలుగానే ఉంటారని చెప్పారు.

ఇవీ చూడండి.

సమరాంధ్ర బరిలో ప్రధాన పార్టీల ఎంపీ అభ్యర్థులు!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details