తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉచితంగా పంపిణీ చేయనున్న బియ్యం సంచులను ముఖ్యమంత్రి జగన్ పరిశీలించారు. సంచుల పంపిణీ ప్రారంభించాలని సీఎం ఆదేశించారని పౌరసరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ తెలిపారు. కొత్త బియ్యం కార్డుల జారీ ప్రక్రియ ఈ నెల 6 నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తు చేసిన అయిదు రోజుల్లోనే అర్హతలు పరిశీలించి.. కొత్త కార్డులు జారీ చేస్తామని శశిధర్ పేర్కొన్నారు.
త్వరలో బియ్యం సంచుల పంపిణీ.. - 6 నుంచి కొత్త బియ్యం కార్డులు న్యూస్
నాణ్యమైన బియ్యం పంపిణీలో భాగంగా బియ్యం కార్డు దారులకు ప్రభుత్వం త్వరలో ఉచితంగా సంచులు పంపిణీ చేయనుంది. వాటిని సీఎం జగన్ పరిశీలించారు.
![త్వరలో బియ్యం సంచుల పంపిణీ.. civil supplies department distribution new rice cards from 6th june](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7466925-767-7466925-1591217100144.jpg)
civil supplies department distribution new rice cards from 6th june