'రాజధాని అమరావతికి స్వచ్ఛందంగానే భూములిచ్చాం' - CID investigation over amaravathi lands issue
!['రాజధాని అమరావతికి స్వచ్ఛందంగానే భూములిచ్చాం' సీఐడీ విచారణకు హాజరైన పలువురు ఎస్సీ రైతులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11073564-362-11073564-1616149952167.jpg)
15:32 March 19
సీఐడీ విచారణకు హాజరైన పలువురు ఎస్సీ రైతులు
రాజధాని అసైన్డ్ భూముల కేసులో సీఐడీ ముమ్మర విచారణ జరిపింది. గంటూరు జిల్లా తాడేపల్లి పోలీసు స్టేషన్లో సీఐడీ విచారణకు పలువురు ఎస్సీ రైతులు హాజరయ్యారు. తమ భూములను రాజధానికి స్వచ్ఛందంగా ఇచ్చామని రైతులు సీబీఐ అధికారులకు వివరించారు. తమ వద్ద భూములను ఎవరూ లాక్కోలేదని, బెదిరించలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన పరిహారం కూడా అందిందని రైతులు తెలిపారు.
ఇదీచదవండి: చంద్రబాబు క్వాష్ పిటిషన్పై హైకోర్టులో విచారణ వాయిదా