ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: ఆల్‌టైమ్‌ రికార్డు కొట్టిన చికెన్

ఇప్పటికే కొండెక్కిన కోడిమాంసం ధర మరింత పెరిగింది. వేసవి కాలంలో గతంలో ఎప్పుడూ చికెన్​ కిలో రూ.246 దాటలేదు. శుక్రవారం స్కిన్‌లెస్‌ కిలో రూ.257కు చేరడం ఆల్‌టైమ్‌ రికార్డుగా పౌల్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

By

Published : May 16, 2020, 12:37 PM IST

Telangana
తెలంగాణ: ఆల్‌టైమ్‌ రికార్డు కొట్టిన చికెన్..

చికెన్​ రేటు ఆల్‌టైమ్‌ రికార్డును సృష్టించింది. మునుపెన్నడు లేని విధంగా కిలో మాంసం రూ.257కు చేరింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌ నెలల్లో కోళ్ల పరిశ్రమ తీవ్రంగా నష్టపోయింది. ఫలితంగా రాష్ట్రంలో కోళ్ల పెంపకం 50 శాతానికి పడిపోయింది. దీనికి తోడు ఎండ తీవ్రత పెరిగి కోళ్లు తక్కువ బరువు వస్తున్నాయి. ఈ ప్రభావమే ప్రస్తుతం ధరలు పెరగడానికి దోహదపడింది.

కాస్త ఊరట..

చికెన్‌ తింటే కరోనా వస్తోందనే దుష్ప్రచారం, లాక్‌డౌన్‌ సంక్షోభంతో కోళ్లను ఉచితంగా ఇచ్చేసిన రైతులకు ఇప్పుడు కాస్త ఊరట లభిస్తోంది. శుక్రవారం కోళ్ల ఫారాల వద్ద లిఫ్టింగ్‌ ధర కిలోకు రూ.140 చొప్పున చెల్లించారు. శనివారం ఈ ధరను రూ.145గా నిర్ణయించారు. ఈ లెక్కన ప్రస్తుతం రూ.257 ఉన్న ధర రూ.260 దాటేందుకు అవకాశాలున్నాయి.

అయితే గతంలో నష్టపోయిన దానితో పోలిస్తే రైతులకు దక్కేది చాలా తక్కువని నేషనల్‌ ఎగ్‌ కోఆర్డినేషన్‌ కమిటీ (నెక్‌) ప్రతినిధులు చెబుతున్నారు. వారు వెల్లడించిన గణాంకాల ప్రకారం లాక్‌డౌన్‌కు ముందు రాష్ట్రంలో ప్రతి నెలా నాలుగు కోట్ల నుంచి నాలుగున్నర కోట్ల వరకు కోడిపిల్లలు వేసేవారు. ఇప్పుడు రెండు కోట్లు మాత్రమే వేస్తున్నారు.

ముందుకు రావడం లేదు..

మునుపటితో పోలిస్తే పరిస్థితులు కాస్త చక్కబడుతున్నా.. రెస్టారెంట్లు, హోటళ్లు తెరవకపోవడంతో చాలా మంది రైతులు కోళ్లు పెంచేందుకు ముందుకు రావడం లేదు. హోటళ్లు, మెస్‌లను తెరిస్తే గానీ కోళ్ల పెంపకం సాధారణ స్థితికి వచ్చేలా లేదని నెక్‌ ప్రతినిధి సంజీవ్‌ చింతావర్‌ తెలిపారు.

ఇది చూడండి:నేడు రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై సీఎం సమీక్ష

ABOUT THE AUTHOR

...view details