ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నారాయ‌ణ‌స్వామి విగ్రహం ఆవిష్కరించిన చంద్రబాబు - తెదేపా నేత నారాయ‌ణ‌స్వామి విగ్రహం

తెలంగాణలోని మహబూబ్​నగర్ కార్మిక నేత నారాయ‌ణ‌స్వామి కాంస్య విగ్రహాన్ని తెదేపా అధినేత చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు నారాయ‌ణ‌స్వామి స్వగ్రామమైన అమ్మ‌పూర్ గ్రామంలో కార్యక్రమం జరిగింది. ఆన్‌లైన్ ద్వారా నారాయణస్వామి విగ్రహాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు.

Chandrababu unveiled the idol of Narayanaswamy at mahabub nagar
నారాయ‌ణ‌స్వామి విగ్రహం ఆవిష్కరించిన చంద్రబాబు

By

Published : Nov 21, 2020, 2:00 PM IST

Updated : Nov 21, 2020, 5:58 PM IST

తెలంగాణ రాష్ట్రం మహబూబ్​నగర్​లో తెదేపా సీనియర్​ నేత.. దివంగత నారాయ‌ణ‌స్వామి విగ్రహాన్ని తెదేపా అధినేత చంద్రబాబు ఆవిష్కరించారు. నారాయ‌ణ‌స్వామి స్వగ్రామమైన చిన్న‌చింత‌కుంట మండ‌లం, అమ్మ‌పూర్ గ్రామంలో తెదేపా ఆధ్వర్యంలో విగ్రహం ఏర్పాటు చేశారు.

కార్యక్ర‌మానికి తెలంగాణ తెదేపా అధ్య‌క్షులు ఎల్‌.ర‌మ‌ణ‌, పొలిట్‌బ్యూరో స‌భ్యులు రావుల చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి, జాతీయ పార్టీ అధికార ప్ర‌తినిధులు కొత్త‌కోట ద‌యాక‌ర్‌రెడ్డి, బ‌క్క‌ని న‌ర్సింహులు, సీతా దయాకర్ రెడ్డి, నారాయ‌ణ‌స్వామి కుటుంబ స‌భ్యులు, జిల్లా నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు హాజ‌రయ్యారు.

నారాయ‌ణ‌స్వామి విగ్రహం ఆవిష్కరించిన చంద్రబాబు
Last Updated : Nov 21, 2020, 5:58 PM IST

ABOUT THE AUTHOR

...view details