ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 11, 2021, 9:54 AM IST

ETV Bharat / city

'పూలే స్ఫూర్తితో తెదేపా బీసీల అభ్యున్నతికి పాటుపడుతోంది'

జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ నివాళులర్పించారు. పూలే స్ఫూర్తితో తెదేపా బీసీల అభ్యున్నతికి పాటుపడుతోందని వ్యాఖ్యానించారు. పూలే సామాజిక, దేశ సేవలను స్మరించుకుందామని పేర్కొన్నారు.

చంద్రబాబు, లోకేశ్ నివాళులు
చంద్రబాబు, లోకేశ్ నివాళులు

వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి జ్యోతిరావు పూలే కృషి చేశారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కొనియాడారు. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా చంద్రబాబు, లోకేశ్ నివాళులర్పించారు. వర్ణ, కుల, లింగ వివక్షపై పోరాడి ప్రజలను చైతన్యపరిచారన్న చంద్రబాబు... పూలే స్ఫూర్తితో తెదేపా బీసీల అభ్యున్నతికి పాటుపడుతోందని వ్యాఖ్యానించారు. వెనుకబాటుకు మూలం సమాజంలో సగభాగమైన మహిళలు విద్యకు దూరమవడమే కారణమని భావించి, స్త్రీలకు ప్రత్యేకంగా పూలే పాఠశాలలు ప్రారంభించారని కొనియాడారు. జ్యోతిరావు పూలే సామాజిక, దేశ సేవలను స్మరించుకుందామని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details