ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఇస్రో శాస్త్రవేత్తలకు చంద్రబాబు అభినందనలు

By

Published : Nov 7, 2020, 8:23 PM IST

Updated : Nov 7, 2020, 9:16 PM IST

పీఎస్ఎల్వీ సీ-49 ప్రయోగం విజయవంతం కావటం పట్ల తెదేపా అధినేత చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ట్విటర్ వేదికగా ఇస్రో శాస్త్రవేత్తలకు ఆయన అభినందనలు తెలిపారు.

pslvc 49
pslvc 49

శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగకేంద్రం నుంచి పీఎస్ఎల్వీ సీ- 49 విజయవంతంగా ప్రయోగించిన శాస్త్రవేత్తలకు తెదేపా అధినేత చంద్రబాబు అభినందనలు తెలిపారు. దేశం మొత్తం మరోసారి గర్వపడేలా కృషి చేశారని ప్రశంసించారు. భారతదేశాన్ని ప్రపంచశక్తిగా మార్చటంలో శాస్త్రవేత్తలు చేస్తున్న కృషి అద్భుతమని ట్వీట్ చేశారు.

Last Updated : Nov 7, 2020, 9:16 PM IST

ABOUT THE AUTHOR

...view details