ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చొరవతో రాష్ట్రంలో ధాన్యం సేకరణ, చెల్లింపుల నిధులను కేంద్రం విడుదల చేసింది. ఈ మేరకు ఎఫ్సీఐకు రూ.2,498.89 కోట్లు విడుదల చేసింది. ఎఫ్సీఐ ఈ మొత్తాన్ని ఏపీ పౌరసరఫరాల శాఖకు బదిలీ చేయనుంది. రాష్ట్రంలో రైతుల వద్ద నుంచి ధాన్యం సేకరణ, చెల్లింపుల విషయంలో వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలపై సంబంధిత మంత్రులతో ఉపరాష్ట్రపతి ఇటీవల చర్చించారు. ఎఫ్సీఐ, పౌరసరఫరాల శాఖ అధికారులతోనూ చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో నిధులు ఇస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. నిధుల విడుదలపై వెంకయ్య హర్షం వ్యక్తం చేశారు.
ఉపరాష్ట్రపతి చొరవతో ఏపీకి రూ.2,498.89కోట్లు విడుదల - Central Government funds Releases news
రాష్ట్రంలో రైతుల వద్ద నుంచి ధాన్యం సేకరణ, చెల్లింపుల విషయంలో రాష్ట్రానికి కేంద్రం నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రూ.2,498.89 కోట్లను ఎఫ్సీఐకి ఇచ్చింది. ఎఫ్సీఐ ఈ మొత్తాన్ని రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు బదిలీ చేయనుంది. ఇటీవల ఈ అంశంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రులు, అధికారులతో చర్చలు జరిపారు.
![ఉపరాష్ట్రపతి చొరవతో ఏపీకి రూ.2,498.89కోట్లు విడుదల ఉపరాష్ట్రపతి చొరవతో ఏపీకి రూ.2,498.89కోట్లు విడుదల](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6322264-719-6322264-1583511752552.jpg)
ఉపరాష్ట్రపతి చొరవతో ఏపీకి రూ.2,498.89కోట్లు విడుదల