ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 1, 2020, 7:15 PM IST

ETV Bharat / city

'ప్రాంతాలు, సామాజిక వర్గాల మధ్య చీలికే జగన్​ లక్ష్యం'

సీఎం జగన్​పై ట్విటర్​ వేదికగా ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. ఓ రాజకీయ నాయకుడు ప్రజల్లో విశ్వసనీయత కోల్పోవడం సిగ్గుచేటని విమర్శించారు.

cbn fires on jagan over amaravati issue
cbn fires on jagan over amaravati issue

ప్రాంతాలు, సామాజిక వర్గాల మధ్య చీలిక తెచ్చి స్వార్థ ప్రయోజనాలు పొందడమే జగన్ నైజమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. ప్రజలెవరూ ఆ బూటకపు మాటల్ని నమ్మి మోసపోవద్దంటూ రాజధాని రైతులు గట్టిగా చెబుతున్నారన్నారు. అమరావతి ప్రాంతానికి చెందిన ఓ రైతు ఆవేదనకు సంబంధించిన వీడియోను ట్విటర్​లో పంచుకున్నారు. ల్యాండ్​పూలింగ్​కు సంబంధించి జగన్​ ఎన్నికలకు ముందు ఓ మాట... ఇప్పుడు మరో మాట మాట్లాడుతున్నారని ఆ వీడియోలో రైతు ఆరోపించారు. ఒక రాజకీయ నాయకుడు ఇలా ప్రజల్లో విశ్వసనీయత పోగొట్టుకోవడం సిగ్గుచేటని చంద్రబాబు విమర్శించారు.

ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details