మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహం నుంచి విచారణ చేపట్టిన సీబీఐ అధికారులు...ఇవాళ వివేకా కుమార్తె సునీతను దాదాపు 3 గంటల పాటు విచారించారు. సీబీఐ విచారణకు హాజరయ్యే ముందు సునీత... నల్లటి బ్యాగుతో లోపలికి వెళ్లారు. సీబీఐ అధికారులకు వివరించేందుకు తన వద్దనున్న ఆధారాలు, వివిధ రకాల దస్త్రాలను తీసుకెళ్లినట్లు సమాచారం.
వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలని సునీత హైకోర్టును ఆశ్రయించింది. 15 మందిపై అనుమానం వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.