ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 16, 2020, 7:59 PM IST

ETV Bharat / city

ఏపీజెన్‌కోలో బొగ్గు అక్రమ రవాణా- అదానీ సంస్థపై సీబీఐ కేసు

2010లో ఏపీజెన్​కోకు బొగ్గు సరఫరా అక్రమాలకు సంబంధించి అదానీ ఎంటర్​ప్రైజస్, ఎన్​సీసీఎఫ్ మాజీ అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసింది.

Cbi registered on adani and nccf former employee about coal supply
అదానీ సంస్థ, ఎన్​సీసీఎఫ్​ మాజీ అధికారుల​పై సీబీఐ కేసు

అదానీ ఎంటర్‌ప్రైజస్‌, ఎన్‌సీసీఎఫ్‌(జాతీయ సహకార- వినియోగదారుల సమాఖ్య)మాజీ అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసింది. నేరపూరిత కుట్ర, మోసం, నియమాల ఉల్లంఘనపై కేసు నమోదింది. 2010లో ఏపీజెన్‌కోకు బొగ్గు సరఫరాలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలతో కేంద్రం దర్యాప్తు సంస్థ ఈ కేసు పెట్టినట్లు తెలుస్తోంది.

ఏం జరిగింది..?

విజయవాడ నార్ల తాతరావు పవర్ స్టేషన్, కడపలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్లకు రైలు మార్గాన 6 లక్షల మిలియన్​ టన్నుల బొగ్గు సరఫరా చేసేందుకు ఏపీజెన్​కో 2010లో టెండర్లు పిలిచింది. ఈ ప్రక్రియలో ఎన్​సీసీఎఫ్​ మాజీ ఛైర్మన్ వీరేంద్ర సింగ్, మేనేజింగ్ డైరెక్టర్ జీపీ గుప్తా... అదానీ సంస్థకు కాంట్రాక్టు వచ్చేలా వ్యవహరించారని సీబీఐ... వీరిపై ఎఫ్​ఐఆర్​ నమోదుచేసింది. బొగ్గు సరఫరాలో అక్రమాలు జరిగాయని వీరేంద్ర సింగ్, గుప్తా, ఇతర అధికారులు, అదానీ సంస్థపై సీబీఐ కేసు నమోదు చేసింది.

ఇదీ చదవండి :

ప్రభుత్వాస్పత్రుల అభివృద్ధికి రూ.436 కోట్లు విడుదల

ABOUT THE AUTHOR

...view details